జేపీ నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు

జేపీ నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. రేపు కరీంనగర్లో జరగనున్న ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభకు ఆయన హాజరుకానున్నారు. రేపు మధ్యాహ్నం 2.10 నిమిషాలకు నడ్డా హైదరాబాద్ చేరుకోనున్నారు. 2.50కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 3.30కి కరీంనగర్ చేరుకుంటారు. 3.40 కు పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకుని..4.30 వరకు అక్కడే ఉంటారు. 4.45 నిమిషాలకు కరీంనగర్ నుంచి బయలుదేరి 5.25 కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. శంషాబాద్ నుంచి 5.35కు బయలుదేరి ఢిల్లీకి వెళ్లనున్నారు. 

మొదట జేపీ నడ్డా ఈ నెల 16న వస్తారని ప్రచారం జరిగినా..ఆ రోజు ఆయన హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించాల్సి ఉండడంతో బహిరంగ సభ షెడ్యూల్ ఈనెల 15 కు మారింది. దీంతో రెండు రోజులు ముందుగానే బండి  సంజయ్ పాదయాత్ర ముగియనుంది. రేపటి బహిరంగ సభను విజయవంతం చేస్తామని బండి సంజయ్ అన్నారు. ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణ బీజేపీకి అడ్డా అని నిరూపిస్తామని తెలిపారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేననే సంకేతాలను ప్రజల్లోకి పంపుతామని చెప్పారు.