కమల్ వ్యాఖ్యలపై ఈసీ కి ఫిర్యాదు చేస్తాం: బీజేపీ

కమల్ వ్యాఖ్యలపై ఈసీ కి ఫిర్యాదు చేస్తాం: బీజేపీ

దేశంలో తొలి ఉగ్రవాది హిందువే అని సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ పై బీజేపీ సీరియస్ అయ్యింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్‌ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని  తెలిపింది. ఎన్నికల్లో లబ్ధి కోసమే కమల్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై  కమల్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.

తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ ప్రచార ర్యాలీలో కమల్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సే స్వతంత్ర భారతదేశంలో తొలి హిందూ టెర్రరిస్టు అంటూ కమల్‌ హాసన్‌ వ్యాఖ్యానించారు.