ఢిల్లీలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం

ఢిల్లీలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం
  • ఒక్క రోజులోనే 40 మంది ఆసుపత్రిలో చేరిక

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనుకుని ఊరట పొందుతున్న తరుణంలో మరో వైపు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు గత వారం రోజులుగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో సుమారు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు గుర్తించారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. సుమారు 40 మంది సర్‌ గంగారమ్‌ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ అనుమానంతో చేరారని, మరో 16 మంది బెడ్స్‌ కోసం ఎదురు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకు ఢిల్లీలో 25 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బయటపడ్డాయని అధికార వర్గాల సమాచారం. వీరంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, కేసుల పెరుగుదలపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నుండి కోలుకున్న వారే దీని బారిన పడుతున్నట్లు సమాచారం.