
హైదరాబాద్, వెలుగు: ఎంఎస్ఎంఈల కోసం బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) నిర్వహిస్తున్న 'కామధేను ఎస్టేట్స్ బీఎన్ఐ గోనాట్ 2023' ను సంస్థ జాతీయ డైరెక్టర్ హేము సువర్ణ, హరి కృష్ణ, ఎక్స్పోర్ట్స్ చైర్మన్ సావ్జీ ధోలాకియా హైదరాబాద్లోని హైటెక్స్ లో శనివారం ప్రారంభించారు. ఇది నాలుగో ఎడిషన్. రెండు రోజులు జరగనుంది. బీఎన్ఐ హైదరాబాద్ రీజియన్ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
మొదటి రోజు సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారులు తమ అనుభవాలను పంచుకున్నారు. సావ్జీ ధోలాకియా, హేము సువర్ణ, ఐడియల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ ఆయుష్ బన్సాల్, బీఎన్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఈ సెమినార్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సంస్థ ప్రొడక్ట్స్ ను లాంచ్ చేశారు. బీఎన్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ రకాల ఉత్పత్తులను, సేవలను ప్రదర్శించారు. వీటిలో కొన్ని స్టార్టప్లూ ఉన్నాయి.