బోధన్, వెలుగు: జిల్లాలోయూరియా కొరత లేకుండా చూడాలని, స్టాక్ మొత్తం జీరో అయ్యేదాకా చూడొద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం బోధన్ మండలం మావందిఖుర్దు విలేజ్ సింగిల్ విండో గోదాంలో యూరియా స్టాక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న యూరియా వివరాలు రైతులకు తెలిసేలా స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రైవేట్ డీలర్లు విధిగా రూల్స్పాటించేలా పర్యవేక్షణ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. యాసంగిలో యూరియా షార్టేజ్ రాకుండా ముందస్తు ప్లాన్తో యంత్రాంగం పనిచేయాలని చెప్పారు. ఆయన వెంట డీఏవో వీరాస్వామి తదితరులు ఉన్నారు.
