ఆప్ఘనిస్తాన్ లో బాంబు పేలుళ్లు : 9 మంది మృతి

ఆప్ఘనిస్తాన్ లో  బాంబు పేలుళ్లు : 9 మంది మృతి

కాబూల్‌ : ఆప్ఘనిస్తాన్ లో ఐఎస్‌ఐఎస్‌ (ISIS) తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర ఆఫ్గనిస్థాన్ లో గురువారం రాత్రి మినీ బస్సుల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు. రెండు బాంబు పేలుళ్లలో 9 మంది మృతిచెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్‌లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు పేలుళ్లు జరిపారని తాలిబన్‌ అధికారులు తెలిపారు. షియాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ముష్కరులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్‌ఐఎస్‌ (ISIS) ప్రకటించింది. 

మరిన్ని వార్తల కోసం.. 

వడ్లు దింపుకోని మిల్లర్లు..వానలకు తడుస్తున్న వడ్లు

సీఎం స్టాలిన్‌ కుమారుడికి భారీ ఊరట