ముంబై హైకోర్టులో నటి కంగనకు చుక్కెదురు

ముంబై హైకోర్టులో నటి కంగనకు చుక్కెదురు

ముంబయి: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. బాలీవుడ్ మాటల రచయిత జావేద్‌ అఖ్తర్‌ తనపై వేసిన పరువు నష్టం కేసును కొట్టివేయాల్సిందిగా కంగనా రౌత్ వేసిన  పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఆమెపై పరువు నష్టం కేసు ఇప్పటికే దిగువ కోర్టులో నడుస్తుండగా దాన్ని కొట్టివేయాలని ఆమె బాంబే  హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవతి మోహితె దేరే కంగన పిటిషన్ ను తిరస్కరించింది. కంగన రనౌత్ తరపున న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖీ వాదించగా..   ఆరోపణలపై విచారణ జరిపించాల్సిందేనంటూ బాంబే హైకోర్టు విచారణకు ఆదేశించింది.