
న్యూయార్క్: ఇండియా స్టార్ రోహన్ బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ.. యూఎస్ ఓపెన్లో బోణీ చేసింది. బుధవారం రాత్రి జరిగిన మెన్స్ డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ 6–4, 6–2తో క్రిస్టోఫర్ ఓ కానెల్–అలెగ్జాండర్ వెకిచ్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. 55 నిమిషాల మ్యాచ్లో బోపన్న ద్వయం ఐదు బ్రేక్ పాయింట్లలో మూడింటిని కాచుకుంది. ప్రత్యర్థులకు ఒక్క బ్రేక్ పాయింట్ చాన్స్ ఇవ్వకుండా మ్యాచ్ను సొంతం చేసుకుంది.
తమ సర్వీస్లో 72 శాతం పాయింట్లు నెగ్గిన బోపన్న జంట.. ఐదు ఏస్లు కొట్టింది. ఒకే ఒక్క డబుల్ ఫాల్ట్ చేసిన ఇండో–ఆసీస్ జోడీ 22 విన్నర్స్ సాధించింది. మరో మ్యాచ్లో సాకేత్ మైనేని–అస్లాన్ కరాట్సెవ్ (రష్యా) జోడీ నిరాశపర్చింది. లాస్లో డిజెరె (సెర్బియా)–మార్క్ హుస్లేర్ (స్విట్జర్లాండ్) 6–7 (4/7), 6–3, 6–2తో సాకేత్–కరాట్సెవ్పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. తొలి సెట్లో అదరగొట్టిన సాకేత్ జంట తర్వాతి రెండో సెట్లో సర్వీస్లను కాపాడుకోలేకపోయింది.