
- దంచికొట్టిన ఓపెనర్లు జైస్వాల్, గిల్
నేడు ఐదో మ్యాచ్ రా. 8 నుంచి డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో తొలి మూడు టీ20ల్లో ఫెయిలైన ఇండియా ఓపెనర్లు ఎట్టకేలకు హిట్టయ్యారు. అమెరికా గడ్డపై కొత్త కుర్రాడు యశస్వి జైస్వాల్, మరో యంగ్ స్టర్ శుభ్మన్ తమ బ్యాట్ పవర్ చూపెట్టారు. దాంతో నాలుగో టీ20లో గ్రాండ్ విక్టరీ సాధించిన ఇండియా సిరీస్ను 2-2తో సమం చేసి నేడు ఆఖరాటకు రెడీ అయింది.
లాడెర్హిల్ (అమెరికా): ఛేజింగ్లో యశస్వి జైస్వాల్ (51 బాల్స్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 84 నాటౌట్), శుభ్మన్ గిల్ (47 బాల్స్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 77) చెలరేగడంతో.. శనివారం జరిగిన నాలుగో టీ20లో ఇండియా 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్ను 2–2తో సమం చేసింది.
టాస్ నెగ్గిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 178/8 స్కోరు చేసింది. హెట్మయర్ (39 బాల్స్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 61), షై హోప్ (29 బాల్స్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 45) రాణించారు. తర్వాత ఇండియా 17 ఓవర్లలో 179/1 స్కోరు చేసి గెలిచింది. యశస్వికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం ఐదో టీ20 జరుగుతుంది.
‘హిట్’మయర్
ముందుగా బ్యాటింగ్కు దిగిన విండీస్కు రెండో ఓవర్లోనే ఝలక్ తగిలింది. 6, 4, 4తో ఖాతా ఓపెన్ చేసిన మేయర్స్ (17)ను అర్ష్దీప్ ఔట్ చేశాడు. తర్వాత బ్రెండన్ కింగ్ (18), షై హోప్ చెరో ఫోర్, సిక్స్ బాదారు. కానీ ఐదో ఓవర్లో అర్ష్దీప్ (3/38) కింగ్ను పెవిలియన్కు పంపిస్తే, ఏడో ఓవర్లో కుల్దీప్ (2/26) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఐదు బాల్స్ తేడాలో నికోలస్ పూరన్ (1), రొవ్మన్ పావెల్ (1)ను ఔట్ చేశాడు. ఈ దశలో హోప్తో కలిసిన హెట్మయర్ చివరి వరకు క్రీజులో నిలిచాడు.
ఈ ఇద్దరు స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ముందుకు సాగినా, 10వ ఓవర్లో హోప్ 6, 4తో బ్యాట్ ఝుళిపించాడు. ఫలితంగా పవర్ప్లేలో 55/2తో ఉన్న స్కోరు ఫస్ట్ టెన్లో 79/4కు పెరిగింది. ఇక్కడి నుంచి హెట్మయర్ 4, 6, 4తో మరింత రెచ్చిపోయాడు. 13వ ఓవర్లో హోప్ ఔట్కావడంతో ఐదో వికెట్కు 49 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. 15వ ఓవర్లో అక్షర్ (1/39).. షెపర్డ్ (9)ను వెనక్కి పంపితే. ఆ వెంటనే ముకేశ్ (1/25).. హోల్డర్ను ఔట్ చేశాడు. అయినా హెట్మయర్ 6, 6, 4, 6 కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఔటయ్యాడు. చివర్లో హుస్సేన్ (5 నాటౌట్), స్మిత్ (15 నాటౌట్) 4, 6 కొట్టడంతో విండీస్ మంచి టార్గెట్ ఇచ్చింది.
165 రన్స్ పార్ట్నర్షిప్
ఛేజింగ్లో ఇండియా ఓపెనర్లు యశస్వి, గిల్ అదరగొట్టారు. తొలి ఓవర్లో రెండు ఫోర్లతో టచ్లోకి వచ్చిన యశస్వి ఓవర్కు ఒకటి, రెండు బౌండ్రీలు బాదాడు. మధ్యలో గిల్ సిక్స్ల జోష్ చూపెట్టాడు. దీంతో పవర్ప్లేలో ఇండియా 66/0 స్కోరు చేసింది. పవర్ప్లే తర్వాత కూడా ఈ ఇద్దరి జోరు తగ్గలేదు. చకచకా బాల్ను రోప్ దాటించడంతో 10 ఓవర్లలో స్కోరు100కు పెరిగింది. ఈ క్రమంలో చెరో 30 బాల్స్లో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు.
12వ ఓవర్లో యశస్వి సిక్స్ రాబట్టగా, తర్వాతి ఓవర్లో సిక్స్ కొట్టిన గిల్ రివ్యూలో ఎల్బీ నుంచి బయటపడ్డాడు. 14వ ఓవర్లో యశస్వి 4, 6 బాదడంతో 15 ఓవర్లలో ఇండియా 157/0తో నిలిచి పది వికెట్ల తేడాతో గెలిచేలా కనిపించింది. అయితే 16వ ఓవర్లో సిక్స్ కొట్టిన గిల్ ఔట్ కావడంతో ఫస్ట్ వికెట్కు 165 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఇండియా తరఫున తొలి వికెట్కు ఇది హయ్యెస్ట్ పార్ట్నర్షిప్. చివర్లో యశస్వి, తిలక్ వర్మ (7 నాటౌట్) చెరో ఫోర్తో మ్యాచ్ ముగించారు.
స్కోరు బోర్డు
వెస్టిండీస్: మేయర్స్ (సి) శాంసన్ (బి) అర్ష్దీప్ 17, బ్రెండన్ కింగ్ (సి) కుల్దీప్ (బి) అర్ష్దీప్ 18, షాయ్ హోప్ (సి) పటేల్ (బి) చహల్ 45, నికోలస్ పూరన్ (సి) సూర్య (బి) కుల్దీప్ 1, పావెల్ (సి) గిల్ (బి) కుల్దీప్ 1, హెట్మయర్ (సి) తిలక్ వర్మ (బి) అర్ష్దీప్ 61, షెపర్డ్ (సి) శాంసన్ (బి) పటేల్ 9, హోల్డర్ (బి) ముకేశ్ కుమార్ 3, ఒడియాన్ స్మిత్ (నాటౌట్) 15, అకీల్ హోస్సేన్ (నాటౌట్) 5, ఎక్స్ట్రాలు: 3, మొత్తం: 20 ఓవర్లలో 178/8. వికెట్లపతనం: 1–19, 2–54, 3–55, 4–57, 5–106, 6–118, 7–123, 8–167. బౌలింగ్: అక్షర్ పటేల్ 4–0–39–1, అర్ష్దీప్ సింగ్ 4–0–38–3, చహల్ 4–0–36–1, కుల్దీప్ 4–0–26–2, హార్దిక్ 1–0–14–0, ముకేశ్ కుమార్ 3–0–25–1.
ఇండియా: యశస్వి (నాటౌట్) 84, గిల్ (సి) హోప్ (బి) షెపర్డ్ 77, తిలక్ వర్మ (7 నాటౌట్), ఎక్స్ట్రాలు: 11, మొత్తం: 17 ఓవర్లలో 179/1. వికెట్లపతనం: 1–165, బౌలింగ్: మెకాయ్ 3–0–32–0, అకీల్ హుస్సేన్ 4–0–31–0, హోల్డర్ 4–0–33–0, షెపర్డ్ 3–0–35–1, స్మిత్ 2–0–30–0, పావెల్ 1–0–13–0.