
లింగంపేట, వెలుగు: మండలంలోని ఐలాపూర్ గ్రామ శివారులోని వంతెన మరమ్మతు పనులను మంగళవారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్ ప్రారంభించారు. ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు వంతెన కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనకు మొరం వేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఆదేశించడంతో పనులు చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మొకిరె బైరయ్య, మామిడి సంగయ్య, రాజు, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.