
కామారెడ్డి, వెలుగు: ఎక్కడైతే మన అస్థిత్వం లేకుండా ఆంధ్రా పాలకులు చేశారో.. అక్కడే తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని నిర్మించుకున్నామని ఆర్ అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో దశాబ్ది ఉత్సవాలపై ఆయన రివ్యూ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన రాష్ర్టానికి దేశ, విదేశాల నుంచి ప్రెసిడెంట్లు, సీఎంలు, ఇతర ప్రతినిధులు ఎవరు వచ్చినా మొదటగా తెలంగాణ అమరుల స్మారకాన్ని దర్శించుకునేలా ప్రోటోకాల్ రూపొందించనున్నట్లు తెలిపారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో 9 ఏండ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించిందన్నారు. అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందన్నారు. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు అంతా కలిసి దశాబ్ది ఉత్సవాలు సక్సెస్ చేయాలన్నారు. సమీక్షలో విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్పర్సన్ దఫేదర్ శోభ, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మంతుషిండే, జాజాల సురేందర్, కలెక్టర్ జితేష్ వీ పాటిల్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్దొత్రే, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.