క్యాంప్‌‌కు వెళ్లిన భువనగిరి బీఆర్‌‌‌‌ఎస్‌‌ కౌన్సిలర్లు

క్యాంప్‌‌కు వెళ్లిన భువనగిరి బీఆర్‌‌‌‌ఎస్‌‌ కౌన్సిలర్లు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీకి చెందిన బీఆర్‌‌‌‌ఎస్‌‌ కౌన్సిలర్లు శుక్రవారం రాత్రి క్యాంప్‌‌కు వెళ్లారు. బీఆర్ఎస్​ చైర్మన్, వైస్​ చైర్మన్​ ఎనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్యపై సొంత పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే.  16 మంది బీఆర్ఎస్​ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్​ 9, బీజేపీకి చెందిన ఆరుగురు అవిశ్వాసంపై సంతకం చేశారు.

 23న అవిశ్వాసం మీటింగ్​ నిర్వహణ కోసం కలెక్టర్​ హనుమంతు జెండగే కౌన్సిలర్లకు నోటీసులు కూడా అందించారు.  విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి అసంతృప్త కౌన్సిర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే రిజైన్ చేస్తామన్న చైర్మన్, వైస్​ చైర్మన్ ​చేయకపోవడంతో కౌన్సిలర్లు శుక్రవారం మీటింగ్​చేసుకొని క్యాంప్​నకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు కౌన్సిలర్​ ఎండీ అజీమ్​ ఆధ్వర్యంలో 15 మంది వికారాబాద్​లోని ఓ ఫాంహౌస్​కు వెళ్లారు.  కాంగ్రెస్​ కౌన్సిలర్లు కూడా క్యాంప్‌‌నకు వెళ్తారని తెలుస్తోంది. అవిశ్వాస మీటింగ్​ సమయానికి వారందరూ భువనగిరికి వస్తారని సమాచారం.