
హైదరాబాద్, వెలుగు: అణచివేత ధోరణిలో సీఎం రేవంత్ పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ వాళ్లకి పరిపాలన చేతకాదని నాడు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారని.. కానీ, దేశమే గర్వపడేలా తెలంగాణను కేసీఆర్అభివృద్ధి చేసి చూపించారని పేర్కొన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘‘దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దళితబంధును ఆపేసింది.
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే రియల్ ఎస్టేట్ పడిపోయింది. అందగత్తెలను చూసేందుకు 5 సార్లు అందాల పోటీలకు వెళ్లిన ముఖ్యమంత్రి.. ఒక్కసారి కూడా రైతులను పరామర్శించలేదు. వ్యవసాయం, విద్యుత్, నీటి రంగంలో విధ్వంసం జరుగుతున్నది’’ అని శ్రవణ్ ఆరోపించారు.