మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ లీడర్లు

మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ లీడర్లు

చెన్నూరు, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్ ​శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి సమక్షంలో కోటపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్​యూత్​ కార్యకర్తలు, లీడర్లు కాంగ్రెస్​లో చేరారు. శనివారం రాత్రి చెన్నూరు మంత్రి క్యాంపు ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్ ​బోయిని రాజలింగు నేతృత్వంలో  కోటపల్లి మండలం వెల్మపల్లికు చెందిన బీఆర్​ఎస్ మండల యూత్​ జనరల్​ సెక్రటరీ ఐత రాజేందర్​రెడ్డి, తన అనుచరులైన పలువురితో కాంగ్రెస్​లో చేరగా వారికి మంత్రి కండువాలు వేసి ఆహ్వానించారు. 

వివేక్​ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధికి అకర్షితులై కాంగ్రెస్​లో చేరినట్లు రాజేందర్​రెడ్డి తెలిపారు. అంతకు ముందు మంత్రి ప్రజలను నుంచి పలు వినతులు తీసుకున్నారు. చెన్నూరు మండలాల కాంగ్రెస్​లీడర్లు మహేశ్​తివారీ, హేమంత్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ​