మూడు శాతం తగ్గిన .. మిడ్, స్మాల్​క్యాప్​ ఇండెక్స్​లు

మూడు శాతం తగ్గిన .. మిడ్, స్మాల్​క్యాప్​ ఇండెక్స్​లు
  • మూడు శాతం తగ్గిన .. మిడ్, స్మాల్​క్యాప్​ ఇండెక్స్​లు
  • ప్రాఫిట్​​ బుకింగే కారణం జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు

ముంబై: ప్రాఫిట్​ ​బుకింగ్​ ఎక్కువ కావడంతో బీఎస్ఈ మిడ్​, స్మాల్​క్యాప్​ ఇండెక్స్​లు మంగళవారం దాదాపు మూడుశాతం నష్టపోయాయి. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మిడ్​క్యాప్​2.8 శాతం తగ్గి 32,200 పాయింట్లకు పడిపోగా, స్మాల్​క్యాప్​ 3.1 శాతం నష్టంతో 37,510 పాయింట్లకు చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇవి రెండు 28 శాతం లాభపడ్డాయి. ఏప్రిల్​ నుంచి 45 శాతం ర్యాలీ చేశాయి. మిడ్​క్యాప్​, స్మాల్​క్యాప్​లో ర్యాలీ ఉంటుందని కోటక్​ సెక్యూరిటీస్ ఇటీవల తెలిపింది. అయితే మిడ్​క్యాప్​లో మెజారిటీ స్టాక్స్, ముఖ్యంగా బీఎఫ్​ఎస్​ఐ సెక్టార్​పనితీరు బాగా లేదని పేర్కొంది. ఈ సెగ్మెంట్లోని మెజారిటీ కంపెనీల ఫండమెంటల్స్​ బాగా లేకపోయినా బాగా ర్యాలీ చేశాయని వివరించింది. ఆషికా గ్లోబల్ ఫ్యామిలీ ఆఫీస్ సర్వీసెస్ కో–ఫౌండర్​అమిత్​ జైన్​మాట్లాడుతూ.. ప్రస్తుతం, స్మాల్‌‌‌‌క్యాప్‌‌‌‌ల, మైక్రోక్యాప్‌‌‌‌ల వాల్యుయేషన్​ వాటి వృద్ధి సామర్థ్యంతో పోలిస్తే  ఎక్కువ ఉందని చెప్పారు. ఉదాహరణకు, నిఫ్టీ మైక్రో క్యాప్ 250 పీఈ నిష్పత్తి 33 కాగా, నిఫ్టీ 50 పీఈ 22,  నిఫ్టీ 500 పీఈ నిష్పత్తి 25 ఉంది. దీనిని బట్టి చూస్తే చాలా మైక్రోక్యాప్ స్టాక్‌‌‌‌లకు రిస్క్- రివార్డ్ రేషియో అనుకూలంగా ఉండకపోవచ్చు.  

ఈ మైక్రోక్యాప్‌‌‌‌లలో స్వల్పకాలిక లాభాలను కోరుకునే ఇన్వెస్టర్లు కంపెనీ వ్యాపారాలపై బలమైన నమ్మకం ఉంటేనే ముందుకు సాగాలి. లేకపోతే  క్యాపిటల్​ను కోల్పోయే ప్రమాదం ఉంది.  నిఫ్టీ50,  నిఫ్టీ మైక్రో క్యాప్ 250 మధ్య వాల్యుయేషన్‌‌‌‌లలో ఇటువంటి తేడాలు మైక్రోక్యాప్ స్టాక్​లలో   ధర, టైమ్​ కరెక్షన్​లకు దారితీశాయి. నిర్మల్ బ్యాంగ్ ఈక్విటీస్ సీఈఓ రాహుల్ అరోరా మాట్లాడుతూ, మార్కెట్లో ఆకర్షణీయమైన పెట్టుబడులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని, మంచి స్టాక్స్​ అన్నీ అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి స్టాక్స్​ తక్కువ ధరలకు అందుబాటులో లేవు కాబట్టి ఇన్వెస్టర్లు సాధారణంగా కొనని స్టాక్‌‌‌‌ల కోసం చూస్తున్నారు. గతంలో పట్టించుకోని స్టాక్‌‌‌‌లు అకస్మాత్తుగా ఖరీదైనవిగా మారాయి”అని చెప్పారు.