అభివృద్ధి పేరిట బీఆర్ఎస్సోళ్లు దోచుకున్నరు : యెర్రా కామేశ్

అభివృద్ధి పేరిట  బీఆర్ఎస్సోళ్లు దోచుకున్నరు : యెర్రా కామేశ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అభివృద్ధి పేర బీఆర్ఎస్​ప్రజాప్రతినిధులు, లీడర్లు ప్రజల సొమ్మును దోచుకున్నారని బీఎస్పీ స్టేట్​జనరల్​సెక్రెటరీ యెర్రా కామేశ్​ఆరోపించారు. కొత్తగూడెంలోని నాలుగో వార్డులో ఆదివారం ఆయన ఇంటింటికీ బీఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామేశ్​మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్​కె.సీతాలక్ష్మి కొత్తగూడెం టౌన్​అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫండ్స్​తెచ్చింది లేదని విమర్శించారు. 

టౌన్​ప్రజలకు మురుగు నీరే దిక్కైందన్నారు. అపరిశుభ్రతకు నిలయంగా మారిందన్నారు. దోమలతో స్థానికులు అల్లాడుతున్నారని మండిపడ్డారు. పారిశుద్ధ్యం విషయంలో పాలకులు, మున్సిపల్​ఆఫీసర్లు ఫెయిల్​ అయ్యారన్నారు. ఆయన వెంట బీఎస్పీ నేతలు గంధం మల్లికార్జున్​రావు, సీహెచ్ నిరంజన్, కోటి, అరవింద్ ​ఉన్నారు.