భద్రాచలం/ హసన్పర్తి, వెలుగు: సర్ ప్రోగ్రామ్తో అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. శుక్రవారం భద్రాచలం నియోజరవర్గంలోని బూత్స్థాయి లీడర్లకు, హనుమకొండ అంబేద్కర్ భవన్లో వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాట్లాడారు. భద్రాచలంలో వెంకట్రావు మాట్లాడుతూ సర్ ప్రోగ్రాంలో పాల్గొనే అధికారులతో పాటు బూత్ స్థాయిలో పార్టీ లీడర్లు కూడా పర్యవేక్షించాలన్నారు.
హనుమకొండలో ఎంపీ కడియం కావ్య పాల్గొని పవర్పాయింట్ ప్రజెంటేషన్ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితా నిర్వహణ, బూత్స్థాయి కార్యకలాపాలు, ఏజెంట్ల బాధ్యతలపై అవగాహన కల్పించారు. భద్రాచలంలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్నకుమారీ, టీపీసీసీ తరుఫున సూపర్ ట్రైనర్ కోఆర్డినేటర్ గరిశెల సురేందర్ ముదిరాజ్, హనుమకొండ ప్రోగ్రాంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, వరంగల్కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ అయూబ్తదితరులు పాల్గొన్నారు.
