లారీ ఢీకొని బీటెక్ స్టూడెంట్ మృతి

లారీ ఢీకొని బీటెక్ స్టూడెంట్ మృతి

కుషాయిగూడ, వెలుగు: బైక్ ను టిప్పర్ లారీ ఢీకొట్టగా బీటెక్ స్టూడెంట్ చనిపోయిన ఘటన కీసర పీఎస్ పరిధిలో జరిగింది. ఈసీఐఎల్ లోని కమలానగర్ లో ఉండే ఖరత్మోల్ యశ్వంత్(21) కీసరలోని గీతాంజలి కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. సోమవారం ఉదయం 8.20 గంటలకు బైక్ పై కాలేజీకి బయలుదేరాడు. 8.40 గంటలకు నాగారంలోని మిలాన్ గార్డెన్ దగ్గరికి రాగానే ఓ టిప్పర్ లారీ వెనుక నుంచి యశ్వంత్ బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో కిందపడ్డ యశ్వంత్ పై నుంచి లారీ టైర్లు వెళ్లడంతో అక్కడిక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యశ్వంత్​ తండ్రి సుభాష్ చందర్​కు సమాచారం అందించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

కూలిని ఢీకొట్టిన కారు.. 
జీడిమెట్ల: కారు ఢీకొని ఓ వ్యక్తి చనిపోయిన ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది.  మేడ్చల్​ జిల్లా గౌడవెళ్లికి చెందిన కె. నర్సింహులు (48) హమాలీగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం బైక్ పై కొంపల్లికి వెళ్తున్నాడు.  కండ్లకోయ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద వెనుక నుంచి వచ్చి ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ నర్సింహులు అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు ఫైల్ చేశారు.

శంషాబాద్: కొత్తూరు మండలం జెపీ దర్గా ఇనముల్ నర్వ గ్రామానికి చెందిన ఎండీ అఫ్సర్(40)  బైక్ పై  సిటీకి వస్తున్నాడు. పాలమాలకు వద్ద వెనుక నుంచి వచ్చిన ఓ లారీ అతడి బైక్ ను ఢీకొట్టింది.  ప్రమాదంలో అఫ్సర్  తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు. కేసు ఫైల్ చేశారు.