లాభాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు

లాభాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు

నిర్మలమ్మ పద్దు స్టాక్ మార్కెట్లో జోష్ నింపింది. ఎలాంటి ప్రతికూల ప్రకటనలు లేకపోవడం ముఖ్యంగా ఆదాయపన్ను విధానంలో మార్పు మార్కెట్ సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపింది. దీంతో సూచీలన్నీ దూసుకుపోయాయి. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సెన్సెక్స్ 720 పాయింట్లకుపైగా లాభంతో 60,276పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఐసీఐసీఐ,హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, కోటాక్ బ్యాంక్, టాటా స్టీల్, ఐటీసీ, ఇండస్ ఇండ్, భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్ షేర్లు ప్రాఫిట్లో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 130పాయింట్లకుపైగా లాభంతో 17,795 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.