నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు లారీ ఢీ

నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు లారీ ఢీ

నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. పీఏ పల్లి మండలం చిలకమర్రి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ నుంచి దేవరకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్ స్సీడ్‌తో వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని  స్థానికులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

వీడియో వైరల్: ఇండియా-పాకిస్తాన్ అండర్19లో సూపర్ అవుట్

కాజల్ మైనపు బొమ్మ.. అచ్చు కాజల్‌ను తలపించేలా..