మొజంజాహీ మార్కెట్ దగ్గర బస్సు బోల్తా

మొజంజాహీ మార్కెట్ దగ్గర బస్సు బోల్తా

హైదరాబాద్ మొజంజాహీ మార్కెట్ సర్కిల్‌లో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడింది. బుధవారం తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లా డిపోకు చెందిన బస్సును ఎంజే మార్కెట్ సిగ్నల్‌ మలుపు దగ్గర ఇసుక లారీ ఢీకొనడంతో బస్సు బోల్తాకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో సహా ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. రోడ్డుకు మధ్యలో బోల్తా పడిన బస్సును  క్రేన్ సహాయంతో తొలగించారు.