క్వార్టర్స్‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌, సాత్విక్‌‌‌‌-చిరాగ్‌‌‌‌

క్వార్టర్స్‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌, సాత్విక్‌‌‌‌-చిరాగ్‌‌‌‌

కోపెన్‌‌‌‌హాగెన్‌‌‌‌:  బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌లో ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌  హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రణయ్‌‌‌‌, డబుల్స్‌‌‌‌ టాప్‌‌‌‌ ప్లేయర్లు సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి క్వార్టర్ ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌  సింగిల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో తొమ్మిదో సీడ్‌‌‌‌ ప్రణయ్‌‌‌‌ 21–18, 15–21, 21–19తో ఏడో సీడ్‌‌‌‌ లో కీన్‌‌‌‌ యివ్‌‌‌‌ (సింగపూర్‌‌‌‌)కు షాకిచ్చాడు.  మరో మ్యాచ్‌‌‌‌లో  11వ సీడ్‌‌‌‌ లక్ష్యసేన్‌‌‌‌ 14–21, 21–16, 13–21తో కున్లావుట్‌‌‌‌ (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌) చేతిలో పోరాడి ఓడాడు. డబుల్స్‌‌‌‌  ప్రిక్వార్టర్స్​లో  రెండో ర్యాంకర్‌‌‌‌ సాత్విక్‌‌‌‌ –చిరాగ్‌‌‌‌ షెట్టి జంట 21–15, 19–21, 21–9తో ఇండోనేసియాకు చెందిన పదో సీడ్‌‌‌‌ కార్నాండో–మార్టిన్‌‌‌‌పై విజయం సాధించింది. విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ 14–21, 9–21తో   చైనాకు చెందిన టాప్‌‌‌‌ సీడ్‌‌‌‌ చెన్‌‌‌‌ క్వింగ్‌‌‌‌- –యి ఫన్‌‌‌‌ చేతిలో ఓడింది.