న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో ముందంజ వేసింది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్లో సింధు రెండు స్థానాలు మెరుగుపడి 15వ ర్యాంక్లో నిలిచింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్లో క్వార్టర్ఫైనల్కు చేరుకోవడం తెలుగమ్మాయి ర్యాంక్ మెరుగుపడటానికి దోహదం చేసింది. మెన్స్లో కిడాంబి శ్రీకాంత్ 20వ ర్యాంక్కు పడిపోయాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన హెచ్.ఎస్. ప్రణయ్, లక్ష్యసేన్ వరుసగా 9, 11వ ర్యాంక్ల్లో కొనసాగుతున్నారు.
ప్రియాన్షు రజావత్ మూడు స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్కు చేరుకోగా, మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్ 43, 49వ ర్యాంక్ల్లో ఉన్నారు. మెన్స్ డబుల్స్లో సాత్విక్–చిరాగ్ షెట్టి రెండో ర్యాంక్ నిలబెట్టుకున్నారు. విమెన్స్లో ట్రీసా జాలీ– పుల్లెల గాయత్రి రెండు స్థానాలు కిందకు పడి 19వ ర్యాంక్లో నిలిచారు.