
న్యూఢిల్లీ: దేశంలోని 8 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన 8 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (అక్టోబర్ 6) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు 2025, నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. 2025, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. బీహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2025, నవంబర్ 6, 11వ తేదీల్లో బీహార్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ.
ఉప ఎన్నికలు జరగనున్న 8 అసెంబ్లీ స్థానాలు ఇవే:
- జమ్మూ కాశ్మీర్: బుద్గాం, నగ్రోటా
- తెలంగాణ: జూబ్లీహిల్స్
- రాజస్థాన్: అంటా
- జార్ఖండ్: ఘట్సిలా
- పంజాబ్: తార్న్ తరణ్
- మిజోరం: దంపా
- ఒడిషా: నుపవాడా