8వ వేతన సంఘం నిబంధనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం (అక్టోబర్ 28) ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్భేటీలో 8వ వేతన సంఘం (8th Central Pay Commission) కూర్పు, నియమనిబంధనలు, కాలవ్యవధిని కేబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణయంతో రక్షణ సేవల సిబ్బందితో సహా దాదాపు 50లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు వర్తిస్తుంది. వేతన సంఘం సిఫారసులతో ఉద్యోగులకు జీతాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. వేతన సంఘం ఏర్పాటు తేదినుంచి 18 నెలల్లోగా సిఫారసులు సమర్పించనుంది.
వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇతర ప్రయోజనాలను సమీక్షించి సవరణలను అందించనుంది. 2025 జనవరిలో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించినప్పటికీ దాని ఏర్పాటు, పనితీరు మార్గదర్శకాలను ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
8వ వేతనం సంఘం ..
కేంద్ర వేతన సంఘం (CPC) అనేది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక స్వతంత్ర సంస్థ. దీనికి చైర్మన్, పార్ట్ టైం మెంబర్, మెంబర్ సెక్రటరీ ఉంటారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సైనికులు, పెన్షనర్ల భత్యాలు, పెన్షన్లు, ఇతర ప్రయోజనాలను సమీక్షించి, సిఫార్సులు చేస్తుంది. 1946లో మొదటి సంఘం ఏర్పాటు చేశారు.
►ALSO READ | Delhi artificial rain: ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ సక్సెస్.. సాయంత్రం 7గంటల లోపు కృత్రిమ వర్షం!
సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.దేశ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని, జీతాల్లో 20-35శాతం పెరుగుదలకు దారితీస్తాయి. ప్రస్తుతం 8వ సంఘం 2025 జనవరి 16న ఏర్పాటు ప్రకటించారు. 2025 అక్టోబర్ 28న దాని నిబంధనలు (Terms of Reference -ToR) ఆమోదించింది కేబినెట్.
8వ వేతన సంఘం అమలు..
7వ వేతన సంఘం సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమలులో ఉన్నాయి. అదే ట్రెండ్ కొనసాగితే.. 8వ సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమలులయ్యే అవకాశం ఉంది.వేతన సంఘాన్ని ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నియమిస్తారు.
#WATCH | Delhi: The Union Cabinet, chaired by PM Modi, approved the Terms of Reference of the 8th Central Pay Commission.
— ANI (@ANI) October 28, 2025
Union Minister Ashwini Vaishnaw says, "The composition, the terms of reference, and the time period of the 8th Central Pay Commission have been approved by… pic.twitter.com/srQ5UYMk9N
ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేనా?..
ఈ సంఘం సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో 20నుంచి-30% పెరుగుదలకు ఉండొచ్చని తెలుస్తోంది. అదనంగా పెన్షన్లు, భత్యాలు, ఇతర ప్రయోజనాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ,పబ్లిక్ సెక్టార్ యూనిట్లపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
