టొరంటో : ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్.. క్యాండిడేట్స్ చెస్లో చాంపియన్గా నిలిచేందుకు అడుగు దూరంలోకి వచ్చేశాడు. ఆదివారం జరిగిన ఓపెన్ సెక్షన్ 13వ రౌండ్లో గుకేశ్ 63 ఎత్తుల వద్ద ఫిరౌజ అలీరెజా (ఫ్రాన్స్, 4.5)పై గెలిచాడు. మరొక్క రౌండ్ మాత్రమే మిగిలున్న టోర్నీలో గుకేశ్ 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఫాబియానో కరువానా (అమెరికా, 8 పాయింట్లు) తో గేమ్లో ఆర్. ప్రజ్ఞానంద (6) ఓటమిపాలయ్యాడు.
విదిత్ గుజరాతీ (5.5).. నజత్ అబసోవ్ (అజర్బైజాన్, 3.5) మధ్య గేమ్ 31 ఎత్తుల వద్ద డ్రాగా ముగిసింది. సోమవారం జరిగే ఆఖరి రౌండ్లో గుకేశ్.. నకామురా (8 పాయింట్లు)తో తలపడుతాడు. ఈ టోర్నీలో విన్నర్గా నిలిస్తే.. వరల్డ్ చాంపియన్షిప్ కోసం డింగ్ లిరెన్ (చైనా)తో తలపడతాడు. విమెన్స్ సెక్షన్లో కోనేరు హంపి (6.5).. అనా ముజిచుక్ (5) గేమ్ 45 ఎత్తుల వద్ద డ్రా కాగా, ఆర్. వైశాలి (6.5).. టింగ్జి లీ (చైనా, 7.5)ని 67 ఎత్తుల్లో ఓడించింది.