హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని ఓ కిరాణా షాపులోంచి పోలీసులు 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్స్, 4 కిలోల ఎండు గంజాయి పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు.
జీడిమెట్ల, వెలుగు: గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న ఓ కిరాణ దుకాణంపై మాదాపూర్ఎస్వోటీ, జగద్గిరిగుట్ట పోలీసులు దాడిచేశారు. షాపులో నుంచి పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్స్, గంజాయి పౌడర్ను పట్టుకున్నారు. పశ్చిమ్ బెంగాల్ , కోల్కత్తాలోని అసాన్సోల్గ్రామానికి చెందిన మనోజ్కుమార్అగర్వాల్ (54) హైదరాబాద్ శివారులోని జగద్గిరిగుట్ట అంజయ్యనగర్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణం మాటున పశ్చిమ బెంగాల్ నుంచి గంజాయి చాక్లెట్స్, గంజాయి తెచ్చి విక్రయిస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారంతో మాదాపూర్ ఎస్వోటీ, జగద్గిరిగుట్ట పోలీసులు దాడులు చేశారు. ఈదాడుల్లో దుకాణంలో ఉన్న 26 కిలోల 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్స్, 4 కిలోల ఎండు గంజాయి పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. మనోజ్కుమార్ను అరెస్ట్చేశారు. విచారణలో గంజాయి చాక్లెట్స్, గంజాయిని కోల్కత్తాలోని మోహన్ అనే వ్యక్తి నుంచి తరచూ కొనుగోలు చేసి తెచ్చి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.2.66 లక్షలు ఉంటుందని..ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రధాన సరఫరాదారుడు మోహన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని బాలానగర్ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు. సుభాశ్నగర్కి చెందిన సంగిశెట్టి వెంకటేశ్వర్లు (52) పీడీఎస్ బియ్యాన్ని విక్రయిస్తున్నాడు. బాలానగర్ ఎస్వోటీ , జీడిమెట్ల పోలీసులు దాడి చేసి, 3,800కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.