ఎస్​ఎంఈ షేర్లలో ..ప్రైస్​ మానిప్యులేషన్​

ఎస్​ఎంఈ షేర్లలో ..ప్రైస్​ మానిప్యులేషన్​
  •     వెల్లడించిన సెబీ చీఫ్​ మాధవి

ముంబై : చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎస్‌‌‌‌ఎంఈ) విభాగంలో ప్రైస్​ మానిప్యులేషన్​ "సంకేతాలు" కనిపిస్తున్నాయని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్  సెబీ చైర్‌‌‌‌పర్సన్ మాధవీ పూరీ బుచ్ సోమవారం అన్నారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ)తోపాటు,  ట్రేడింగ్​లోనూ అవకతవకలు జరుగుతాయని

పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. "మేము అలాంటి సంకేతాలను (ప్రైస్​ మానిప్యులేషన్) చూస్తున్నాము. ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి మాకు టెక్నాలజీ ఉంది. ప్రస్తుతానికి సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇంకా అక్రమాలు మొదలుకాలేదు”అని మాధవీ పురి వివరించారు.