ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బగేశ్వర్ జిల్లాలోని సామా గ్రామస్థులు హూక్రాలోని కోకిలా దేవి ఆలయానికి కారులోబయల్దేరారు. ఈ క్రమంలో జూన్22 న ఉదయం 7.30 గంటలకు పితోర్గఢ్ జిల్లాలోని మున్సియారీ బ్లాక్ లో ఉన్న 600 మీటర్ల లోయలో కారు అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు సహాయక చర్యలు చేపట్టాయి. గత రాత్రి కురిసిన వర్షాలకు రోడ్డుపై బురద, చెత్తచెదారం పేరుకుపోయిందని, దీంతో వాహనాలు జారిపోతున్నాయని తోటి ప్రయాణికులు వెల్లడించారు. వర్షాలు కురుస్తున్నందునా వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.