బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముజఫరాపుర్లోని కంతి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 28పై కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
For More News..
