
- మహారాష్ట్ర నవీ ముంబైలో కేసు నమోదు
థానే: పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఓ మహిళా కానిస్టేబుల్పై రెండేండ్లుగా అత్యాచారానికి పాల్పడిన ఎస్సైపై రేప్ కేసు నమోదు అయింది. మహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్ షిప్లో ఓ సబ్ ఇన్స్పెక్టర్(32) పెళ్లయిన ఓ మహిళా కానిస్టేబుల్(26)ను పెండ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు లు తెలిపారు. 2020– 2022 జులై వరకు సాన్పద ఏరియాలో ఓ ఫ్లాట్ కిరాయికి తీసుకొని పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు.
భర్తను విడిచి పెట్టాలని.. లేదంటే అతన్ని చంపేస్తానని ఆమెను బెదిరించాడని తెలిపారు. ఇదే టైమ్లో ఆమె నుంచి రూ.19 లక్షల తీసుకొని అందులో రూ.14 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చాడని అన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం నవీ ముంబై టౌన్ షిప్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఎంక్వైరీ కోసం సంపాడు స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేసినట్లు వివరించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), 354 (ఏ) (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.