నిబంధనలను ఉల్లంఘించిన 14 బస్సులపై కేసులు నమోదు

నిబంధనలను ఉల్లంఘించిన 14 బస్సులపై కేసులు నమోదు

విశాఖపట్నం: నిబంధనలను ఉల్లంఘించిన 14 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఉప రవాణా కమిషనర్ జిసి రాజారత్న . సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15వ తేదీ సోమవారం ప్రైవేటు బస్సులపై ప్రత్యేక  తనిఖీలు నిర్వహించామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 14 బస్సులపై కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు.

ఈ నెల 13 నుంచి ప్రైవేటు బస్సులపై ప్రత్యేక  తనిఖీలు నిర్వహించి వివిధ రకాల నిబంధనలను ఉల్లంఘించిన 51 బస్సులపై కేసులు నమోదు చేశామని... ఈనెల 17 వరకు తనిఖీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజారత్నం హెచ్చరించారు.