
కష్టపడో.. ఇష్టపడో కొనుక్కున్న వాహనం. సొంతంగా కొనుక్కుంటే గాడ్ గిఫ్ట్, అమ్మో, నాన్నో కొనిస్తే వాళ్ల గిఫ్ట్. పార్టీల జెండాలు, పిల్లల పేర్లు, లవ్ కొటేషన్లు… బైకులు, కార్లపై ఇలాంటి రాతలెన్నో చూస్తుంటాం. కొందరైతే కులం, మతం, ప్రొఫెషన్, హీరోల పేర్ల స్టిక్కర్లూ వేస్తుంటారు. నెంబర్ ప్లేట్ మీదో, కారు అద్దాలపైనో ఇలా స్టిక్కర్లు అతికిస్తుంటారు. ఇది చట్టాన్ని అతిక్రమించడమేనని, దీనికి రూ.5 వేల వరకూ ఫైన్ వేస్తామని రాజస్థాన్ ట్రాఫిక్పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 3 నుంచి వాహనాలను చెక్ చేస్తూ ఇలాంటివేవన్నా ఉంటే ఫైన్ వేస్తున్నారు. ఇలాంటి రాతలతో సమాజంలో కుల, మతతత్వాలు పెరిగిపోతున్నాయని ట్రాఫిక్ ఎస్పీ చెప్పారు. విండ్స్క్రీన్పై రాతలతో డ్రైవర్ కు రోడ్డు సరిగా కనబడదని, దాంతో ప్రమాదాలు జరుగుతాయని అంటున్నారు. అయితే, ఈ రూల్ను అతిక్రమిస్తే విధించే ఫైన్ ఎంతనే విషయంపై ఎస్పీ క్లారిటీగా చెప్పలేదు.