బీఎండబ్ల్యూ కారు కిటికీని పగులగొట్టి రూ.13 లక్షలు దోచుకెళ్లారు

బీఎండబ్ల్యూ కారు కిటికీని పగులగొట్టి రూ.13 లక్షలు దోచుకెళ్లారు

బెంగళూరులో పట్టపగలు చోరీలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారు కిటికీని పగులగొట్టి రూ.13 లక్షల నగదును అపహరించారు. ఈ ఘటనపై సర్జాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్టోబర్ 20న జరిగిన ఈ దొంగతనం నిఘా కెమెరాకు చిక్కడంతో వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియో ఫుటేజ్‌లో ఒక వ్యక్తి BMW X5 కారు కిటికీని పగులగొడుతుండగా.. అతని సహచరుడు మోటార్‌సైకిల్‌పై వేచి ఉన్నట్లు చూపిస్తుంది. అనంతరం కారులో ఉన్న డబ్బుతో అక్కడి నుంచి పరారయ్యారు. కారు బెంగళూరులోని అనేకల్ తాలూకాకు చెందిన బాబుకు చెందినట్టు సమాచారం. కాగా ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.