లంచం కేసులో.. సీబీఐ వలకు చిక్కిన ఐఆర్ఎస్ అధికారి

లంచం కేసులో.. సీబీఐ వలకు చిక్కిన ఐఆర్ఎస్ అధికారి

న్యూఢిల్లీ: లంచం కేసులో డైరెక్టరేట్ ఆఫ్​ట్యాక్స్ పేయర్ సర్వీసెస్​లో అడిషనల్ డైరెక్టర్​గా పనిచేస్తున్న అమిత్ కుమార్ సింఘాల్ సీబీఐ వలకు చిక్కారు. 2007వ బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారి అయిన అమిత్ కుమార్ సింఘాల్ ఓ కేసు విషయంలో  రూ.25 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డారు.

 అమిత్ రూ.45 లక్షల లంచం డిమాండ్ చేయగా.. మొదటి వాయిదా కింద రూ.25 లక్షలను శనివారం మొహాలీలోని ఆయన నివాసంలో హర్ష్ కోటక్ తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అమిత్ కుమార్ తరపున లంచం తీసుకుంటున్నట్టు అంగీకరించడంతో హర్ష్​ను అరెస్టు చేశారు. 

వసంత్​కుంజ్​లోని నివాసంలో అమిత్ కుమార్​ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.