ఇదేం క్వశ్చన్​.. ఇదేం పేపర్? 

ఇదేం క్వశ్చన్​.. ఇదేం పేపర్? 
  • సీబీఎస్ఈపై లోక్​సభలో సోనియా ఫైర్
  • మహిళలకు కించపరిచేలా ప్యాసేజ్ ఇచ్చారని విమర్శ
  • నిమిషాల్లో స్పందించిన సీబీఎస్ఈ

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ టెన్త్​క్లాస్​పరీక్షలో ఇచ్చిన ఇంగ్లిష్​ కాంప్రహెన్షన్​ప్యాసేజీ మహిళలను కించపరిచేలా ఉందంటూ కాంగ్రెస్‌‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభ్యంతరం తెలిపారు. భర్త మార్గాన్ని అనుసరించడం ద్వారానే భార్య తన పిల్లల నుంచి గౌరవం పొందుతుందని, సమాజంలో, కుటుంబాల్లో సమస్యలకు ప్రధాన కారణం.. మహిళలకు స్వతంత్రత పెరగడమేనని ప్యాసేజీలో ఇవ్వడాన్ని సోనియా ఖండించారు. దీనిపై సీబీఎస్‌‌ఈ వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని ఆమె పార్లమెంట్‌‌లో డిమాండ్‌‌ చేశారు. పార్లమెంట్‌‌సమావేశాల్లో భాగంగా లోక్‌‌సభలో సోమవారం ఈ అంశాన్ని సోనియా లేవెనెత్తారు. కేంద్ర విద్యాశాఖపై దీనిపై పూర్తిస్థాయి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. సోనియా డిమాండ్‌‌పై సభలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతో నిరసనగా కాంగ్రెస్, డీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు లోక్‌‌సభ నుంచి వాకౌట్ చేశాయి. 
తొలగింపు.. ఫుల్ మార్కులు
ఇంగ్లిష్ కాంప్రహెన్షన్‌‌ ప్యాసేజ్‌‌ వివాదాస్పదం కావడం, సోనియా గాంధీ లోక్‌‌సభలో ప్రస్తావించడంతో నిమిషాల్లోనే సీబీఎస్‌‌ఈ స్పందించింది. ప్రశ్నాపత్రం నుంచి ఆ ప్యాసేజీని తొలగించి, స్టూడెంట్లకు ఫుల్​ మార్కులు ఇస్తున్నట్లు ప్రకటించింది.