- 30% వదులుకునేందుకు సిద్ధమైన సీఈసీ, కమిషనర్లు
న్యూఢిల్లీ: కరోనా వ్యతిరేక పోరాటంలో భాగంగా తమ శాలరీల్లో 30 శాతం కోత విధించుకునేందుకు ఎలక్షన్ కమిషనర్లు సిద్ధమయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర తమ బేసిక్ శాలరీలో 30 శాతాన్ని ఏడాది పాటు స్వచ్ఛందంగా వదులుకోవాలని నిర్ణయించారు. సర్వీసులను బట్టి సుప్రీంకోర్టు జడ్జిలతో సమానంగా వీరికి శాలరీ ఉంటుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీలు నెలకు రూ.2.5 లక్షల శాలరీ డ్రా చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ కోత అమలులోకి రానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.