ఆన్​లైన్​ గేమింగ్​కు రూల్స్​ ప్రకటించిన ప్రభుత్వం

ఆన్​లైన్​  గేమింగ్​కు రూల్స్​ ప్రకటించిన ప్రభుత్వం

 

  • ఆన్​లైన్​  గేమింగ్​కు రూల్స్​ ప్రకటించిన ప్రభుత్వం
  • ]గేమర్లకు కేవైసీ వెరిఫికేషన్​ తప్పనిసరి
  • హద్దు దాటే కంపెనీలపై ప్రాసిక్యూషన్
  • ఐటీ మినిస్టర్​ రాజీవ్​ చంద్రశేఖర్​

న్యూఢిల్లీ: ఆన్​లైన్​ గేమింగ్​ కోసం ఫైనల్​ రూల్స్​ను ఎలక్ట్రానిక్స్​ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మినిస్ట్రీ (మెయిటీ) గురువారం ప్రకటించింది. డ్రాఫ్ట్​ రూల్స్​ను ఈ ఏడాది జనవరిలోనే తెచ్చారు. ఫైనల్​ రూల్స్​లో భాగంగా సెల్ఫ్​రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ (ఎస్​ఆర్​ఓ)​ కొన్నింటిని  ప్రభుత్వం అపాయింట్ చేయనుంది. ఈ ఎస్​ఆర్​ఓలలో ఇండస్ట్రీ ప్రతినిధులు, ఎడ్యుకేషనిస్టులు, ఇతర ఎక్స్​పర్టులు, సైకాలజీ ఎక్స్​పర్టులు సహా ఇతర నిపుణులు ఉంటారని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం మూడు ఎస్​ఆర్​ఓలను నోటిఫై చేస్తామని, ఆ తర్వాత  మరిన్నింటిని యాడ్ చేస్తామని వెల్లడించింది. ఆయా గేమ్స్​ బెట్టింగ్​లు ఆఫర్​ చేస్తున్నాయా లేదా అనే ప్రాతిపదికన పర్మిషన్​ ఇవ్వడానికి  ఈ ఎస్​ఆర్​ఓలు బాధ్యత వహిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

బెట్టింగ్​కు అవకాశమిస్తూ, రియల్​ మనీ ట్రాన్సాక్షన్లు జరుపుతున్న  గేమ్స్​ను మాత్రమే తాము రెగ్యులేట్​ చేస్తున్నామని  ఐటీ  మినిస్టర్​ రాజీవ్​ చంద్రశేఖర్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు.  బెట్టింగ్​కు అవకాశం లేదని ఎస్​ఆర్​ఓ భావిస్తే అలాంటి రియల్​ మనీ గేమ్​కు ఎస్​ఆర్​ఓ పర్మిషన్​ ఇవ్వొచ్చని రూల్స్​లో పేర్కొన్నారు. ఆన్​లైన్​ గేమర్స్​కు కూడా కేవైసీ వెరిఫికేషన్​ తప్పనిసరని ఐటీ మినిస్ట్రీ ఈ రూల్స్​లో స్పష్టం చేసింది. కొత్త రూల్స్​ను పాటించని ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలు ప్రాసిక్యూషన్​ ఎదుర్కోవాల్సి వస్తుందని రాజీవ్​ చంద్రశేఖర్​ హెచ్చరించారు. అనుమతి పొందిన ఎస్​ఆర్​ఓల వద్ద తమ గేమ్​ రిజిస్టర్​ చేసుకుని, వాటి అనుమతిని గేమింగ్​ కంపెనీలు పొందడం తప్పనిసరని పేర్కొన్నారు.