పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్న ఎంపవర్డ్ గ్రూప్స్
టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు తెప్పించడంలో కీలకపాత్ర
శాంపిల్స్ టెస్టింగ్కు దేశవ్యాప్తంగా ల్యాబ్స్ గుర్తింపు
ఎగ్జిట్ స్ర్టాటజీపైనా కసరత్తు.. ప్రజల నుంచి సలహాలు స్వీకరణ
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 11 ఎంపవర్డ్ గ్రూపులను మార్చి 29న ఏర్పాటు చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద నియమించిన ఈ కమిటీల్లో సీనియర్ బ్యూరోక్రాట్లు, టాప్ ఎక్స్పర్టులు సభ్యులుగా ఉన్నారు. ఈ 11 టీమ్స్లో మూడింటిని హెల్త్ సిస్టమ్ కోసం కేటాయించారు. కరోనా కట్టడి కోసం ప్లాన్లు రూపొందించేందుకు, వాటిని అవసరాన్ని బట్టి అమలు చేసేందుకు ఈ గ్రూప్స్కు అధికారం ఇచ్చారు. కావాల్సినన్ని టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు తెప్పించడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి. అలాగే శాంపిల్స్ను టెస్టు చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ల్యాబ్స్ను గుర్తించాయి. అన్లైన్ ట్రైనింగ్ నిర్వహించాయి. మరోవైపు కేసులు భారీగా పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మెజారిటీ టీమ్స్ పని చేస్తుండగా.. ఒక టీమ్ మాత్రం లాక్డౌన్ ఎగ్జిట్ స్ర్టాటజీపై పనిచేస్తోంది. ఇంకో టీమ్ ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తోంది. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడం, ఎకనామిక్ యాక్టివిటీని రీస్టార్ట్ చేయడం వంటి వాటిపై వ్యూహాలు రూపొందిస్తోంది.
ఎంపవర్డ్ టీమ్స్ ఇవీ..
1. మెడికల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్లాన్
నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వీకే పాల్ ఈ కమిటీకి హెడ్. ఇందులో హెల్త్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్తోపాటు మరో నలుగురు సభ్యులు ఉన్నారు.
2. హాస్పిటల్స్, ఐసోలేషన్, క్వారంటైన్ ఫెసిలిటీస్, డిసీజ్ సర్వైలెన్స్, టెస్టింగ్
ఈ కమిటీకి ఎన్విరాన్మెంట్ మినిస్ర్టీ సెక్రెటరీ సీకే మిశ్రా హెడ్. ఇందులో రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్ యాదవ్, ఐసీఎంఆర్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రమణ్ ఆర్.గంగాఖేడ్కర్తోపాటు మరో ఆరుగురు ఉన్నారు.
3. అవైలబులిటీ ఆఫ్ ఎసెన్షియల్ మెడికల్ ఎక్విప్మెంట్
ఈ కమిటీకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ సెక్రెటరీ పీడీ వాఘేలా హెడ్గా ఉన్నారు. ఇందులో డీఆర్డీవో సెక్రెటరీ జి.సతీశ్రెడ్డితో పాటు మరో 10 మంది సభ్యులు ఉన్నారు.
4. ఆగ్మెంటింగ్ హ్యూమన్ రిసోర్సెస్, కెపాసిటీ బిల్డింగ్
ఈ కమిటీకి ఎంఎస్ఎంఈ మినిస్ర్టీ సెక్రెటరీ అరుణ్ పాండా హెడ్గా ఉన్నారు. ఇందులో ఏడుగురు సభ్యులు ఉన్నారు.
5. ఫెసిలిటేటింగ్ సప్లై చైన్, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఫర్ ఎసెన్షియల్స్
తాగునీరు, శానిటేషన్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ పరమేశ్వరన్ అయ్యర్ హెడ్గా ఉన్నారు. ఇందులో 10 మంది సభ్యులు ఉన్నారు.
6. కోఆర్డినేషన్ విత్ ప్రైవేట్ సెక్టార్, ఎన్జీవోస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్
నీతి ఆయోగ్ సీఈవో అమిత్ కాంత్ ఈ కమిటీ హెడ్గా ఉన్నారు. ఇందులో ఏడుగురు సభ్యులు ఉన్నారు.
7. ఎకనమిక్, వెల్ఫేర్ మెజర్స్
ఎకనమిక్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ అతున్ చక్రవర్తి ఈ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ఇందులో ఏడుగురు సభ్యులుగా ఉన్నారు.
8. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, పబ్లిక్ అవేర్నెస్
ఇన్ఫర్మేషన్, బ్రాడ్కాస్టింగ్ సెక్రెటరీ రవి మిట్టల్ ఈ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. హోం శాఖ జాయింట్ సెక్రెటరీ పుణ్య సలీల శ్రీవాస్తవతోపాటు మరో ఏడుగురు సభ్యులు ఉన్నారు.
9. టెక్నాలజీ, డేటా మేనేజ్మెంట్
ఎలక్ట్రానిక్స్, ఐటీ మినిస్ర్టీ సెక్రెటరీ అజయ్ సాహ్నే హెడ్గా ఉన్నారు. ఇందులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు.
10. పబ్లిక్ గ్రీవియెన్సెస్, సజెషన్స్
హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ సెక్రటరీ అమిత్ ఖరే ఈ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ఇందులో మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు.
11. స్ర్టాటజిక్ ఇష్యూస్ లింక్డ్ టు లాక్డౌన్
హోం శాఖ సెక్రెటరీ అజయ్ కుమార్ భల్లా ఈ కమిటీ హెడ్. ఇందులో మరో ఐదుగురు సభ్యులుగా ఉన్నారు.
For More News..