లోకేశ్వరంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

లోకేశ్వరంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

లోకేశ్వరం, వెలుగు: భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధురాలు చాకలి ఐలమ్మ అని ఆమె మనుమడు రామచంద్రయ్య అన్నాడు. శుక్రవారం లోకేశ్వరం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐలమ్మనుస్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు.

మహిళలంతా ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. విగ్రహ దాత లోకేశ్వరం ఎంపీటీసీ జేసారావును అభినందించారు. కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర సమన్వయకర్త సుంకర పోశెట్టి,  హరీశ్ భోజరాం, భూమన్న, గజ్జరాం, కృష్ణ, సాయిలు, లింగన్న, మండల నాయకులు పాల్గొన్నారు