చేర్యాల, వెలుగు: రాజకీయాలకతీతంగా చేర్యాల మున్సిపాలిటీని డెవలల్ చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం మున్సిపల్ ఆఫీస్లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీకి మంజూరైన రూ.15 కోట్లతో అవసరం ఉన్నచోట ఖర్చుచేయాలని, రూ.6 కోట్లతో సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లు, మున్సిపల్ బిల్డింగ్కు రూ.1.50 కోట్లు కేటాయించి కాంప్లెక్స్ను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.
అనంతరం పెద్ద చెరువు కట్టను పరిశీలించి, సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా ఎలా పనులు కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. చెరువు కట్ట సుందరీకరణ కోసం రూ.3.14 కోట్ల ఫండ్స్ వస్తే భూమిపూజ చేయకుండా పనులు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. గిరి కొండల్ రెడ్డి, కొమ్ము నర్సింగరావు, కొమ్ము రవి, భాస్కర్ రెడ్డి, నరేందర్, లీలా సంజీవులు పాల్గొన్నారు.
