
ఉత్తర ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జూలై 18 మధ్యాహ్నం 2.35 గంటలకు చండీగఢ్- డిబ్రూగఢ్ రైలు గోండా- మన్కాపూర్ దగ్గర పట్టాలు తప్పింది. ఝులాహి రైల్వే స్టేషన్కు కొన్ని కిలోమీటర్ల ముందు ఏసీ కంపార్ట్మెంట్లోని 4 కోచ్లు పట్టాలు తప్పాయి. మరో 12 బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మృతి చెందగా.. పలువురికి గాయలు అయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన రెస్క్యూ టీం సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ రైలు ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath takes cognisance of the train accident in the Gonda district. He directs the officials to reach the spot immediately and expedite the relief work; gives instructions for proper treatment of the injured: CMO
— ANI (@ANI) July 18, 2024
(file pic) https://t.co/ggCTJKwmq3 pic.twitter.com/FxmUZqzTqH