గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తానని టోకరా ..నిరుద్యోగుల నుంచి రూ.72 లక్షలు వసూలు

గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తానని టోకరా ..నిరుద్యోగుల నుంచి రూ.72 లక్షలు వసూలు
  • నిందితుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు

ఏటూరునాగారం, వెలుగు: సెక్రటేరియేట్​లో అధికారులతో పరిచయం ఉందని, గవర్నమెంట్​ జాబ్స్​ ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన నిందితుడిని ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంంలోని కవిరాజ్ నగర్ కు చెందిన తేజావత్  అనిల్ నాయక్  అలియాస్​ కేతన్  నకిలీ ఐడీ కార్డులు, ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలు చూపించి గవర్నమెంట్​ జాబ్స్​ ఇప్పిస్తానని మోసం చేశాడు. 

2019లో వెంకటాపురంకు చెందిన గొంది లావణ్యకు ట్రాన్స్​కో డిపార్ట్​మెంట్ లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నకిలీ ఐడీ కార్డులు, ఉత్తర్వు కాపీలు చూపించి ఉద్యోగం ఇస్తున్నట్లు నమ్మించాడు. 2020 నుంచి-22 వరకు లావణ్య ద్వారా మరో 26 మందిని నమ్మించి రూ.72 లక్షలు- తీసుకొని తప్పించుకొని తిరుగుతున్నాడు. భాదితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సోమవారం వెంకటాపురం బస్టాండ్​లో అనిల్  నాయక్​ను ఎస్సై కె. తిరుపతిరావు, సీఐ ముత్యం రమేశ్​ అదుపులోకి తీసుకున్నారు.