కాలనీల్లో అభివృద్ధి పనులు త్వరగా చేపట్టాలి : వివేక్​ వెంకటస్వామి

కాలనీల్లో అభివృద్ధి పనులు త్వరగా చేపట్టాలి : వివేక్​ వెంకటస్వామి
  •     చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి
  •     సింగరేణి సింటార్స్​ సెంటర్​ సందర్శన
  •     కార్మెల్​ హైస్కూల్​ డైమాండ్ జూబ్లి వేడుకలకు హాజరు

కోల్​బెల్ట్​,వెలుగు : క్యాతనపల్లి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డులో అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు.  మంగళవారం ఉదయం మున్సిపల్​ అధికారులు, కాంగ్రెస్​ లీడర్లు, కాలనీ వాసులతో కలిసి అమ్మగార్డెన్​ ఏరియాను ఆయన సందర్శించారు.  రోడ్లు, డ్రైయినేజీ నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్‌‌‌‌ సదాశివరెడ్డి​, మున్సిపల్​ఏఈ అచ్యుత్​, ఇతర అధికారులను ఆదేశించారు.  

మందమర్రిలోని సింగరేణి సింటార్స్​సెంటర్​ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కలిసి  సందర్శించారు.  సెంటర్​లో స్కిల్డ్​ డెవలప్​మెం ట్​పై ఇస్తున్న శిక్షణ, ఏర్పాట్లపై మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ. మనోహర్​, ఎస్​ఓటుజీఎం రాజేశ్వర్​రెడ్డి, పర్సనల్​ మేనేజర్​ శ్యాంసుందర్​ను అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు గుడ్ల రమేశ్​, తిరుమల్​, సట్ల సంతోష్‌‌ ​ పాల్గొన్నారు.  

కార్మెల్​ హైస్కూల్​ డైమాండ్​ జూబ్లి వేడుకల్లో...

మందమర్రి పట్టణంలోని కార్మెల్ హై స్కూల్ స్థాపించి  60 ఏళ్లు ​పూర్తయిన సందర్భంగా మంగళవారం రాత్రి నిర్వహించిన  డైమాండ్​ జూబ్లీ వేడుకల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి,  కాంగ్రెస్​ యువనేత గడ్డం వంశీకృష్ణ,  మంచిర్యాల జడ్పీ చైర్​ పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, సీనియర్​ జర్నలిస్టు ఎండి.మునీర్​, స్కూల్​ యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు. 

ALSO READ: బీఆర్ఎస్ కౌన్సిలర్ భూములపై ఫారెస్ట్ అధికారుల దాడులు

కరాటే పోటీల విజేతలను  అభినందించిన వివేక్​

బెల్లంపల్లిలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ పలు బహుమతులు సాధించిన రామకృష్ణాపూర్​ తవక్కల్​ హైస్కూల్​ విద్యార్థులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, కాంగ్రెస్​ యువనేత గడ్డం వంశీకృష్ణ  అభినందించారు. కార్యక్రమంలో స్కూల్​ కరస్పాటెండెంట్​, కాంగ్రెస్​ లీడర్​ ఎండీ.అబ్దుల్​ అజీజ్​ తదితరులు పాల్గొన్నారు.