
- 17వ తేదీన ముగింపు
హైదారబాద్: ఈ నెల 4 న చెరువుగట్టు జాతర ప్రారంభం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి వెల్లడించారు. సచివాలయంలో తన ఛాంబర్ లో చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వాహణపై బుధవారం అధికారులతో మంత్రి వెంకట్ రెడ్డి రివ్యూ నిర్వహించి బ్రహ్మోత్సవాల పోస్టర్, సమాచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండో శ్రీశైలంగా పేరొందిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం, చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహిస్తామన్నారు.
16న అర్ధరాత్రి కళ్యాణోత్సవం ప్రారంభమై 17న ముగుస్తుందన్నారు. స్వామివారికి అధికారికంగా తలంబ్రాలు సమర్పిస్తామన్నారు. భక్తుల కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులకుపలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.