Municipal Elections: చేవెళ్ల మున్సిపాల్టీలో 1 మరియు 4 వార్డుల్లో  బీజేపీకి రెండే ఓట్లు  

Municipal Elections: చేవెళ్ల మున్సిపాల్టీలో 1 మరియు 4 వార్డుల్లో  బీజేపీకి రెండే ఓట్లు  

చేవెళ్ల 1వ వార్డు, 4 వ వార్డులో బీజేపీ అభ్యర్థులకు కేవలం 2 చొప్పున ఓట్లు పడ్డాయి. 13 వ వార్డులో బీఆర్ఎస్​అభ్యర్థికి కేవలం 9 ఓట్లు పోలయ్యాయి. 5వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడలేదు. మొయినాబాద్​లో బీఆర్ఎస్​ 22 వార్డు  అభ్యర్థికి కేవలం 5 ఓట్లు, 4, 25 వార్డుల నుంచి ఇండిపెండెంట్​ గా పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు ఒక్క ఓటు కూడా పడలేదు.  

2 ఓట్లతో విజయం  

మొయినాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డు నుంచి బీఆర్ఎస్​ తరఫున పోటీ చేసిన గునుగుర్తి శిరీష ఇండిపెండెంట్​అభ్యర్థిపై కేవలం 2 ఓట్లతో విజయం సాధించారు. ముందు 5 ఓట్ల మెజార్టీ రాగా.. రీ కౌంటింగ్​ చేశారు. ఈ సారి 2 ఓట్ల మెజార్టీ వచ్చింది. మళ్లీ  కౌంటింగ్ చేసినా ఫలితం మారలేదు. 9వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ముదిగొండ ప్రభాకర్​యాదవ్​బీఆర్ఎస్​అభ్యర్థిపై కేవలం 4 ఓట్లతో గెలిచాడు.