షెడ్యూల్డ్ తెగల జాబితాలోకి 12 సంఘాలు.. 72వేల మందికి పైగా ప్రయోజనం

షెడ్యూల్డ్ తెగల జాబితాలోకి 12 సంఘాలు.. 72వేల మందికి పైగా ప్రయోజనం

ఛత్తీస్‌గఢ్‌లోని 12 తెగల సంఘాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలోకి చేర్చారు. పలు నివేదికల ప్రకారం, దీని వల్ల సుమారు 72వేల మందికి  ప్రయోజనం చేకూరనుంది. షెడ్యూల్డ్ తెగల జాబితాలో భుయిన్య, భుయియాన్, భుయాన్, భరియా భూమియా కమ్యూనిటీ, ధనుహర్, ధనువార్, కిసాన్, నాగసియా, సవర్,  సావోన్రా, ధంగర్, బింజియా, కొడకు, భరియా, పాండోలు ఉన్నాయి.

రాజ్యసభలో బిల్లు ఆమోదం

ఛత్తీస్‌గఢ్‌లోని 12 షెడ్యూల్డ్ తెగ (ST) కమ్యూనిటీలను విభిన్న సంస్కరణలను చేర్చే బిల్లు రాజ్యసభలో ఆమోదించిన తర్వాత గిరిజనులను ST జాబితాలో చేర్చారు. రాజ్యాంగంలోని (ST) ఆర్డర్ (ఐదవ సవరణ) బిల్లు, 2022 .. ప్రకారం ఇది గత ఏడాది డిసెంబర్‌లోనే లోక్‌సభలో ఆమోదించారు.

ఈ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ ముండా సమాధానమిస్తూ, ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 72వేల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఇది తక్కువ సంఖ్యే అయినా గిరిజనుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న సెన్సివిటీని ఇది తెలియజేస్తోందని ఆయన అన్నారు.

AsloRead: అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో భూ ప్ర‌కంన‌లు..

మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం

రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (ఐదవ సవరణ) బిల్లు, 2022 రాజ్యసభలో అంతకుముందు వాకౌట్ చేసిన ప్రతిపక్ష పార్టీలు గైర్హాజరవడంతో వాయిస్ ఓటుతో బిల్లును ఆమోదించారు.