ఛత్తీస్గఢ్ను డ్రై స్టేట్గా ప్రకటిస్తామన్న హామీ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ విషయంపై అధికార పార్టీ అనేక వాదనలు వినిపిస్తున్నా.. మద్యాన్ని నిషేధించడమనేది అత్యంత కఠినమైన నిర్ణయంగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయ రాహిత్యమే బీజేపీకి ఆశావహులు దాడులు చేసేందుకు మేతగా నిలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం
ఏది ఏమైనప్పటికీ, 34.7 శాతం జనాభా మద్యాన్ని వినియోగిస్తున్న ఈ రాష్ట్రంలో.. కేవలం మద్యం వల్లే సంవత్సరానికి రూ.6 వేల 800 కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం, ఛత్తీస్గఢ్ను 'డ్రై స్టేట్'గా ప్రకటించడం అత్యంత కఠినమైన, సమస్యాత్మకమైన నిర్ణయం మాత్రమే కాదు, భూపేష్ బఘేల్ ప్రభుత్వానికి సాధించలేని అవాస్తవిక కల కూడా.
రాష్ట్రంలో కొనసాగుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఐ-ట్యాక్స్ దాడులతో పాటు సీఎం సహాయ కార్యదర్శి సౌమ్య చౌరాసియా, ఐఏఎస్ అధికారిణి, బొగ్గు వ్యాపారి సూర్యకాంత్ తివారీ, అన్వర్ దేహబర్ తదితరులతో సహా ఆయన సన్నిహితులను అరెస్టు చేయడంతో ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం వాటిల్లింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఇమేజ్ను దెబ్బతీయడానికి, డ్యామేజ్ చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నంలో కొంతమేరకు విజయం సాధించినట్లైంది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర అసెంబ్లీలోని 90 స్థానాలకు గాను 70 స్థానాలను కలిగి ఉన్న కాంగ్రెస్కు ప్రస్తుత పరిస్థితిని నియంత్రణ చేయలేకపోతే.. అది వచ్చే ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులకు దారితీయవచ్చు.