దావూద్ ను చంపేందుకు ప్లాన్

దావూద్ ను చంపేందుకు ప్లాన్

1998 లోనే దావూద్ ను చంపేందుకు చోటా రాజన్ ప్లాన్

    చివరి క్షణంలో ఆపరేషన్ ఫెయిల్

 పోలీసులకు వివరించిన  లక్డావాలా

ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ను 1998 లోనే చోటా రాజన్ గ్యాంగ్ హత్య చేసేందుకు ప్రయత్నించింది. అయితే చివరి క్షణంలో ఆ ప్రయత్నం ఫెయిల్ అయ్యిందంట.  ఈ విషయాన్ని చోటా రాజన్ గ్యాంగ్ సభ్యుడైన  లక్డావాలా చెప్పాడు.  ఒకప్పుడు దావూద్ కు సన్నిహితునిగా ఉన్న లక్డావాలా ఆ తర్వాత చోటా రాజన్ గ్యాంగ్ లో చేరాడు.  దాదాపు 20 ఏళ్లుగా పరారీలో ఉన్న లక్డావాలా  ను గత నెలలో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా దావూద్, చోటా రాజన్ గ్యాంగ్ లకు మధ్య జరిగిన క్రైం ఘటనలను లక్డావాలా పోలీసులకు వివరించాడు. 1998 లోనే దావూద్ ఇబ్రహీం ను చంపేందుకు చోటా రాజన్ గ్యాంగ్ ప్లాన్ చేసింది. ఈ ఆపరేషన్ కోసం విక్కీ మల్హోత్రా, పరీధ్ తనషా, బాలు డోక్రో, లక్డావాలా, వినోద్ మట్కార్, సంజయ్ ఘాటే, బాబా రెడ్డి లతో కూడిన టీం ను సిద్ధం చేసిందంట.  ఈ టీమ్ పాకిస్తాన్ కరాచీలో దావూద్ ను  ఖతం చేసేందుకు పక్కా ప్లాన్ చేసిందని లక్డావాలా ఆనాటి ఆపరేషన్ గురించి వివరించాడు.  తన కూతురు చనిపోయిన తర్వాత దర్గా దగ్గర ప్రార్థన చేసేందుకు దావూద్ వస్తాడన్న సమాచారంతో ఆయనను చంపేందుకు టీం రెడీగా మాటు వేసిందంట.  కానీ దావూద్ పెద్ద ఎత్తున సెక్యూరిటీతో రావటంతో ఆపరేషన్ విఫలమైందని లక్డావాలా చెప్పాడు. ఆ తర్వాత చోటా రాజన్ తమకు ఫోన్ చేసి ఆపరేషన్ గురించి దావూద్ కు లీక్ అయ్యిందని, జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పారని పోలీసులకు వివరించాడు. ఆ తర్వాత రెండు రోజులకే తాము ఉంటున్న ఫ్లాట్ లో పోలీసులు దాడి చేసి కొంతమందిని అరెస్ట్ చేశారన్నాడు. తాము తప్పించుకున్నామని ఆ తర్వాత కొన్ని రోజులకే దావూద్ గ్యాంగ్ ముఠా చోటా రాజన్ ను తనను హత్య చేసేందుకు దాడి చేయగా తప్పించుకున్నామని లక్డావాలా చెప్పాడు.