
కోల్ బెల్ట్: ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ రైతు భరోసా నిధులను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇవాళ (జూన్ 24) మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సండ్రోనిపల్లి రైతు వేదిక వద్ద రైతులు, పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మందమర్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందె రాంచందర్, మండల అధ్యక్షుడు బానోత్ నీలయ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంక టస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ ఫోటోలకు పాలాభిషేకం చేశారు.
ALSO READ | కష్టపడితేనే పదవులు.. మరో పదేళ్లు అధికారం మనదే: సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతూ... ప్రభుత్వం 9 రోజులలో 9 వేల కోట్లను రైతు భరోసా నిధుల కింద 70 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలు రైతులకు అండగా నిలుస్తున్నారని అన్నారు. వారి హయాంలో పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు.